వేకువఝామున తొలికిరణం నువ్వై తాకినందుకే
ప్రతి ఉదయం కొత్తవెలుగులతో స్వాగతిస్తుంది
అపరాహ్నంలో నీ ఊసు తలపోసినందుకే
నీలాకాశం నీ రూపురేఖలతో నను కవ్విస్తుంది
మలిసంధ్యలో నువ్వు నా మది మీటినందుకే
మనసు కొమ్మపై కొత్త కోయిల ఆలపిస్తుంది
నడిరేయిలో నీ తలపు లీలగా మెదిలినందుకే
నా అధరాలపై చిరుదరహాసం తొంగిచూస్తుంది
ఇలా నీ ద్యాసలోనే సాగిన ప్రతీ రోజూ
వేయి రంగుల హరివిల్లై మది విరబూస్తుంది
2 comments:
నందు ,
మీ కవిత చాలా చాలా బాగుంది. Good work keep it up
శ్రేయసీ గారు ధన్యవాదాలు
Post a Comment